తెలుగు ఒక సుందరమైన భాషగా ఆంధ్రమహాభారతం ద్వారా పుట్టింది। ఏ విధంగా చూసినా అది మన సంపద, వారసత్వం అని అనిపిస్తుండేది। ఒకటి రెండు అందులోని పద్యాలు పాఠ్య పుస్తకాలలో చదవడం మినహా, ఆ గ్రంథంతో పరిచయం లేదు। ఈ మధ్య వింటున్న ప్రవచనాల వలన, చదువుతున్న పుస్తకాల వలన మక్కువ ఎక్కువయ్యింది। ఇలాంటి సమయంలో, internet లో మొదలయిన ఒక సంకల్పం ద్వారా ఆంధ్రమహాభారతాన్ని మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశం కలిగింది। అదే "ఆంధ్రమహాభారతం - కవిత్రయం ప్రాజెక్టు"। UNICODE లో ఆంధ్రమహాభారతాన్ని రాయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం।

నాకు తెలిసిన ఛందస్సు, భాష పరిజ్ఞానంతో ఒక తేటగీతి పద్యం రాయడానికి చేసిన ప్రయత్నం।

తే.గీ.
ముగ్గురు కవులు మలచిన మేటి కవిత
పుణ్య తెలుగు భారతికిది పుట్టినిల్లు
ఆంధ్రభారతం అందరం అందవలెను
కూర్చ వలెను మనము యూనికోడు నందు

ఛందస్సు గురించి internet లో నాకు బాగా ఉపయోగపడే వ్యాసం
పూర్తిగా చదవండి