కావలసినవి :


క్యాప్సికం - 2

ఉల్లిపాయలు - 2

పచ్చిమిరపకాయలు - 5

కారం - 1 tbl spoon

ధనియాలు - 1 tbl spoon

నువ్వులు - 1/4 cup

వేరుశనగుళ్ళు - 1/2 cup

కొబ్బరి - 1/2 cup (పొడి)

ఆవాలు - 1/4 tbl spoon

మెంతులు - చిటికెడు

చింతపండు - నిమ్మకాయంత(నీళ్ళల్లో నానబెట్టాలి)
ఉప్పు - తగినంత

నునె - 3 tbl spoons

కొత్తిమెర


తయారు చేసే విధానం :


1.పాన్ లో (నునె లేకుండ)ధనియాలు, వేరుశనగుళ్ళు, నువ్వులు, కొబ్బరి వేసి వేయించి దానిని మంట మీద నుంచి దింపి చల్లారబెట్టాలి.

2.ఇప్పుడు దానిని గ్రైండ్ చేసుకోవాలి (కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చెయ్యాలి).

3.పాన్ లో నునె వేసి అందులో ఆవాలు, మెంతులు వేయించాలి.

4.ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.

5.అందులో క్యాప్సికం ముక్కలు వేసుకొని వేయించాలి.

6.అది కొంచెం వేయించాక దానిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగుళ్ళు ముద్దనీ వేసి వేయించుకొవాలి.

7.అందులో కారం, ఉప్పు వేసి వేయించాలి.

8.ఇప్పుడు నానబెట్టి వుంచుకున్న చింతపండు పులుసు కొంచెం అందులో వేసి, అది కొంచెం గట్టి పడేవరకు వుంచాలి.

9.అలా కొంచెం గట్టిపడేక మంట మీద నుంచి దింపేముందు కొత్తిమెర వేయ్యాలి.

పూర్తిగా చదవండి