నక్సలైటు ప్రభావిత ప్రాంతాలలో పని చేసే పోలీసులకు సత్వర పదోన్నతులు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంచుకున్న పద్ధ్దతిని దేశం లోని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. జస్టిస్‌ ఎకె. మాధుర్‌, జస్టిస్‌ తరుణ్‌ చటర్జీలతో కూడిన బెంచ్‌ మొన్నటి శుక్రవారం ప్రకటించిన ఈ తీర్పుకు మామాలు మాటల్లో అర్థం చె ప్పాలంటే ఎంత ఎక్కువ మంది నక్సలైట్లను చంపితే అంతతొందరగా పదోన్నతులు సంపాదించుకొని, పైపైకి ఎగబాకి పోవడం సమర్థనీయమేనని, అలా ఎక్కువ మందిని చంపిన వారికి సత్వర పదోన్నతి ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరైన పనే చేస్తున్నదని సుప్రీం కోర్టు అన్నదన్న మాట. “చంపినందుకు కానుకలు, బహుమతు లు,పదోన్నతులు ఇవ్వవచ్చు” అనడం ద్వారా చంపడంమంచిదే అని స్వయంగా సర్వోన్నత న్యాయ స్థానమే సూచిస్తున్నట్టు కాదా?
(more…)


పూర్తిగా చదవండి