ఇందులో ఈ జీవో ని నేను ప్రశ్నించను.. దాని ఉద్దేశ్యం సరైనదే అనుకుంటాను.. కానీ దీనికి సంబంధించి మన ప్రభుత్వం ఇచిన నిబంధన ఒకటి నాకు వింతగా అనిపించింది…!!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారో తెలుసుకొవాలి.. కాబట్టి, 4 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకూ ఎక్కడ చదివితే వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వారట… ఇందులో వచే చిక్కుల గురించి ప్రభుత్వం ఆలోచించలేదా?! ఎప్పుదో చిన్నప్పుడు ఉద్యోగ రీత్యా వాళ్ళ తల్లిదంద్రులు ఎదో ఒక ప్రాంతం లో ఉండడం వల్ల ఆ ప్రాంతం లొ చదివితే, వాళ్ళు ఆ ప్రాంతీయులైపోతారా?! మరి వేరే ప్రాంతీయులని పెళ్ళి చేసుకుని ఇంకో చోట స్ఠిరపడిన వాళ్ళ సంగతి?! భార్యాభర్తలలో ఒకళ్ళు తెలంగాణా, ఇంకొకళ్ళని కోస్తా లో చదివి, వాల్ల పిల్లలు సీమ లో చదివితే ఎవరిని వాళ్ళ ప్రాంతానికి పంపించేస్తె సరి.. సమ న్యాయం ఇచినట్టుంటుంది.. పదండి అలాంటి కుటుంబాలేమైనా ఉన్నాయేమో వెతుకుదాం! :)


పూర్తిగా చదవండి