సోహ్రాబుద్దీన్‌ షేక్‌, కౌసర్‌బీ (గుజరాత్‌ పోలీసులచే ఎన్‌కౌంటర్‌ హత్యకు గురయిన భార్యాభర్తలు)ల ఉదంతం అనివార్యంగా ఒక ప్రశ్నకు తావిస్తుంది: ‘మన రాష్ట్రంలో అటువంటి బూటకపు ఎన్‌కౌంటర్‌లో పాత్ర ఉన్నప్పటికీ కనీసం ఎస్‌.ఐ. స్థాయి పోలీసు అధికారి అయినా ఎన్నడైనా నేరారోపణ నెదుర్కొన్నాడా?’ (ప్రస్తావిత గుజరాత్‌ ఎన్‌కౌంటర్‌ ముగ్గురు ఐపిఎస్‌ అధికారుల - ఇద్దరు గుజరాత్‌, మరొకరు రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన వారు- సస్పెన్షన్‌, అరెస్ట్‌కు దారితీసింది). సొహ్రబుద్దీన్‌, కౌసర్‌బీల ఎన్‌కౌంటర్‌ లో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకూ ప్రమేయం ఉందని వార్తలు వెలువడ్డాయి. ఇక్కడి పోలీసధికారులు తక్షణమే ఆ వార్తలను ఖండించడమే కాక పరువు నష్టం దావా దాఖలు చేస్తామన్నంత దూరం పోయారు. (more…)


పూర్తిగా చదవండి