ఇదే విషయం నేను గత కొంత కాలం గా ఆలొచిస్తున్నా,బ్లాగు రాసేంతగా చేసింది నిన్న నేను చూసిన ఇంటార్వ్యు.
అసలు కథ పట్ల మన దర్శకులకు ఎంత అభిమానం ఉందో అది చూస్తే అర్ధం అవుతుంది .
అసలు ఈ మధ్య సినిమాల్లో కథ నిజం గా ఉంటోందా?
ఈ ప్రశ్నకు ఠక్కున లేదు అనే జవాబే చాలా నోట్ల విన్నాను.
నాకో చెడ్డ అలవాటు.ఎవరు సినిమా చూసా అని చెప్పినా,వెంటనే కథ చెప్పు అని ప్రాణం తీస్తా.
ఈ మధ్య ఈ అలవాటుకి కాస్త విరామమం వచ్చింది.సినిమా  చూసిన వాడెవడూ కథ ఏంటో చెప్పట్లేదు
మామూలు మాటల్లో చెప్పలేని దృశ్య కావ్యం ఏమో అని నేను కొన్ని సినిమాలు లేటుగా చూసాను
నాకు ఆ భావమే కలిగింది.
ఇలా బ్లాగులో నేను చూసిన సినిమా గురించి రాయాలంటే నాకు మాటలు దొరకలేదు.
సరే నా తెలుగు పాండిత్యం ఇంతవరకే అనుకుని తృప్తి చెందాను.
ఇలా నన్ను నేను ఎన్నో సార్లు సమధాన పరచుకున్నా,నిన్న నేను చూసిన కార్యక్రమం ఇలా బ్లాగేంతవరకు నిద్ర పోన్నివ్వలేదు. 
ఈ మధ్య అంతా ‘చిరు’  తనయుడు  పేర విడుదల అయిన  చిరుత.
అలా టి వీ తిప్పుతుంటే పూరి జగనాథ్ కనిపించాడు.అంతా ఆ సినిమా క్లాసులో మాట్లాడుతున్నారు ,నేను ఈ కార్యక్రమం చూసి,సినిమ చూసా అని పోసు కొడదాం అని అనుకున్నా.

సరే వాణిజ్య ప్రకటనల విరామాల్లో పూరి మాట్లాడాడు.పాపం ఈ ఆంకరు ఈ సినిమ  కథ తమ ప్రేక్షకులకు చెప్పిద్దాం అని అడిగిన ప్రశ్ననే రక రకాలు గా అడిగినా పూరి ఒకటే జవాబు చెప్పాడు.
ఈ సినిమాలో కథ ఎమీ లేదు అని,కేవలం మెగాస్టార్ తనయుడిని పరిశ్రమకు పరిచయం చెయ్యడం కోసమే ఈ సినిమ తీసానని,కథని పెద్దగా పట్టించుకోలేదని చెప్పడం నాకు భలే ఆశ్చర్యం వేసింది.

నేను సరిగ్గా వినలేదేమో అని ఆ కార్యక్రమం ఆసాంతం చూసాను.మళ్ళీ అదే చెప్పాడు

ఇక ఏం అనాలీ
కథ నటుడి కోసమా?
నటుడు కథ కోసమా?

మన సినిమాలు ఎందుకు అంతర్జాతీయం గా గుర్తింపు పొందట్లేదు అనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనం

ఎవరో కొడుకుని పరిచెయ్యడం కోసం ఇష్టం వచ్చినట్టు ఒక్కో సినిమా నుంచీ కాస్త కాస్త తెచ్చి అతికించడమేనా?

ఒక గొప్ప నటుడి కొడుకు/మనవడు అని అచ్చేసి జనాల మీద కి తొసేస్తె  చాలా?
వారికంటూ ఒక సొంత గుర్తింపు అక్కరలేదా?
అసలు నటించడానికి వారికున్న కనీస అర్హత ఏంటి?
రంగస్థల అనుభవం ఉండాలని ఆశించడం అత్యాశే గాని,కనీసం నటనకు సంబంధిత శిక్షణ ఎంత వరకు  తీసుకున్నారు?
ఏదో గెంతడం,కొట్టడం నేర్చుకున్నంత మాత్రానా హావభావాలను పలికించే అవసరం వారికి లేదా?

 అసలు నటన ఎదో వారసత్వం కొనసాగింపుకా లేక నిజం గా ఈ కళ పట్ల వారికి అంకిత భావం ఉందా?
 

సినిమా అన్నది దృశ్య కావ్యం గా ఎంత మంది దర్శకులు భావిస్తున్నారు
ఒకప్పుడు సినిమా ఒక భాషలో తీస్తున్నారు అంటే ఆ భాష మీద మంచి పట్టు ఉండేది.
అందుకే అప్పటి సినిమాల్లో సంభాషణలు ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నాం,సమయోచితం గా వాడతాం.
మరి ఇప్పుడు సంభాషణలు రాసేవారికి నిజం గా తెలుగు భాష మీద అంత పట్టు ఉందా?

మా బామ్మకి హిందీ రాకున్నా అప్పట్లో “నవ్ రంగ్ ” సినిమాకు బండి కట్టుకు వెళ్ళిందట.ఇప్పటికీ నేను అడుగుతా మా బామ్మని నీకు ఆ సినిమా ఏం అర్ధం అయ్యింది అని.తను చెప్పే సమధానం ఒక్కటే అక్కడ తెర మీద చేసే వారి ముఖం లో ఎం జరుగుతోందో అర్ధం అవుతుంది కదా,ఇక భాషతో అవసరం ఏంటి అని.  

మరి ఇప్పట నటీనటులు అంత చక్కగా హావభావాలు పలికించగలరా?

అసలు నటీనటుల నుంచీ నిజం గా ఈ దర్శకులు నటనను రాబడుతున్నారా?

అసలు దర్శకులుగా పరిచయ్యం అయ్యేవారికి అన్ని విభాగల మీద పట్టు ఉందా?

ఎంతసేపటికీ పరభాషా చిత్రాల నుండి కథను అరువు తెచ్చుకోవడమే తప్ప నిజం గా మనకు కథలు లేవా?

మన పురాణ కథలనే ఇప్పటికాలానికి అణుగుణం గా ఎందుకు మలచరు?

ఇక్కడ మన తెలుగు పాటలు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది

డాక్తర్ చక్రవర్తి చిత్రం లో “ఓ ఉంగలారల ముంగురులున్న రాజా” అన్న జానపద గీతం లో “తస్సదియ్య” అన్న పదానికి సెన్సారు వారు అభ్యంతరం చెప్పారట.
మరి నేడు?
 
అసలు మన తెలుగు సినిమ అంతార్జాతీయ(కనీసం జాతీయ)స్థాయి పురస్కారం పొంది ఎన్ని ఏళ్ళు అయ్యిందో …

జాతీయ పురస్కారం పొందినా అవి నిజం గా అంత విలువ చేస్తాయా అన్న అనుమానం ప్రతి ఒక్కడికీ కలుగుతుంది

తెలుగు సినిమాకు మహర్దశ రావాలంటే ఈ వారసత్వ నటులు పోయి ఈ కళ పట్ల అంకితభావం ఉన్న వాళ్ళు ,భాష మీద పట్టు ఉన్న వాళ్ళు రావాలి.

ప్రభుత్వం తరపున మంచి కళాత్మక సినిమాలకు రాయతీలు కలిపించి అలాంటివి తీసేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

పైరవీలు లేని జాతీయ పురస్కారాలు,అంగాంగ ప్రదర్శననని అనుమతించని సెన్సారు బోర్డు వంటి కనీస చర్యలు తీసుకున్నప్పుడే తెలుగు సిని తల్లి పట్టు బట్ట కడుతుంది


పూర్తిగా చదవండి