ఆదివాసుల దారి
Telugu, Vartamaanam October 23rd, 2007రాష్ట్రంలో ప్రతిఒక్కరి మనసుమీద ప్రశ్నగా వేలాడుతూ నిరంతరం ఆలోచింపజేస్తున్న నక్సలైటు ఉద్యమానికి ఈవారంలో నలభైసంవత్సరాలు నిండుతాయి. తెలుగుసమాజం మీద అసాధారణమైన ప్రభావంవేసిన శ్రీకాకుళ గిరిజన ఉద్యమంలో ఒక ముఖ్యమైన మైలురాయి అక్టోబర్ 31, 1967. ఆరోజున అప్పటి అవిభక్త శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం తాలూకా (ప్రస్తుత విజయనగరం జిల్లా కురుపాం మండలం) లేవిడి గ్రామంలో గిరిజనుల మీద తొలిసారి భూస్వాముల తుపాకులు పేలాయి. ఆరిక కోరన్న, కొండగొర్రి మంగన్న అనే ఇద్దరు గిరిజనులు మరణించారు. నక్సలైటు ఉద్యమం హింసాపూరితమైనదని సాధారణంగా అపోహపడే, ఆరోపించే మధ్యతరగతి ఆలోచనాపరులు ఇవాళ్టి నక్సలైటు ఉద్యమానికి ఈ రాష్ట్రంలో బీజంవేసిన లేవిడి సంఘటనలో హింస ఎవరిదో గుర్తించవలసి ఉంది.
(more…)
పూర్తిగా చదవండి