జిడ్డు కృష్ణమూర్తి గారి దృష్టిలో మరణం
ఆధ్యాత్మికం November 25th, 2007
మనలో ప్రతి ఒక్కరికీ "భయం " గురించి అనుభవమే. జీవితం లో ఏదో ఒక విషయాన్ని గురించి భయపడనివారు ఉండరు. భయపెట్టే విషయాలు మనిషి మనిషికీ వేరు వేరుగా ఉన్నా , అందరినీ భయపెట్టే విషయం గా మాత్రం మరణం గురించి చెప్పవచ్చు . మరణభయం లేనివారు చాలా అరుదుగా ఉంటారు.
మరణభయాన్ని విశ్లేషించి చూస్తే , మరణించేటపుడు పొందవలసిన దేహ బాధ పెట్టే భయం కన్న , మరణం తరువాత నేను ( కూడ బెట్టుకున్న జ్ణాపకాలు , అనుభవాలు , అభిప్రాయాలు వగైరా) మిగలను అనే విషయం తెచ్చే భయమే ఎక్కువ అని తేలుతుంది . మరణం తరువాత మనం ఏమవుతాం ? అనే ప్రశ్నకు నమ్మకమైన సమాధానం లేకపోవటం కూడా మనలో భయానికి మరో కారణం .
మరణం పట్ల మన భయం పోవాలంటే మనలో చాలామందికి మరణం తరువాత ఏదోవిధంగా అంటే సూక్ష్మ దేహమనో , మరోజన్మ అనో ఏదో పేరుతో కొనసాగుతామని నమ్మకం కుదరాలి లేదా కనీసం మరణం తరువాత ఏమవుతుంది? అనే విషయం తెలియాలి . అంటే జీవించి ఉండగానే మరణం అంటే ఏమిటో తెలియాలి . అపుడు చావు భయం చాలా తగ్గుతుంది .
చాలావరకూ మన మతాలన్నీ ఆత్మ శాశ్వతమనీ , పునర్జన్మ అనీ , రకరకాల వివరణలు ఇస్తూ మనం శాశ్వతమనే నమ్మకాన్ని మనలో కలిగిస్తున్నాయి . వాటిద్వారా మనం అందరికీ తెలిసున్న జీవితపు ఈవలి వొడ్డు నుండి ఉందని నమ్ముతున్న మరణం తరువాతి ఆవలి వొడ్డుకు వారధి నిర్మించుకుంటాం . ఏదో విధంగా కొనసాగుతామని నమ్ముతూ మనలో ఉండే మరణభయాన్ని తగ్గించుకుంటాం .
కానీ జిడ్డు కృష్ణ మూర్తి గారు మనం శాశ్వతమని నమ్ముతూ మరణభయం తగ్గించుకోవటం కాకుండా , ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు కాబట్టి మనమూ శాశ్వతం కాదు అని చెప్పడం ద్వారా మరణ భయాన్ని తగ్గించుదామని చూస్తాడు. ఈ ప్రపంచం మొత్తంలో అన్నీ అశాశ్వతమే అయినపుడు మనం మాత్రం శాశ్వతం ఎలా అవుతాం ? అని ప్రశ్నించటమే కాక ఆయన శాశ్వతంగా ఉండటం అనే దానిలో ఉండే అవలక్షణాన్ని కూడా వివరిస్తాడు .
శాశ్వతంగా కొనసాగుతూ ఉండటం అనే దానిలోనే కొత్తదేదీ రాకపోవటం అనే అర్ధం కూడా ఉంది కదా. అలా ఏ కొత్తదనమూ లేకుండా ఎంత కాలం కొనసాగితే మాత్రం ఏమి లాభం ? అంటాడాయన . కొనసాగటం ఆగినపుడే కదా కొత్తదేదైనా ప్రవేశించటం సాధ్యపడేది? పాత విషయాలకు సంబంధించి మనం మరణిస్తే తప్ప కొత్తవీ , సృజనాత్మకమైనవీ ఏవీ మనలోనికి చేరవు. కాబట్టి మనం అంతం కావటానికి భయపడకూడదు . శాశ్వతత్వం మీద ఇష్టాన్ని ఎవరు చంపు కుంటారో వారికి మరణం పట్ల భయం ఉండదు .
సరే , ఇక జీవించి ఉండగానే మరణం అంటే ఏమిటో అది ఎలా ఉంటుందో మనం తెలుసుకోగలమా? అనే ప్రశ్నకు జె. కె. గారు తెలుసుకోగలమనే చెబుతారు. మనకు గల నమ్మకాలనూ , జ్ణాపకాలనూ , అనుబంధాలను అంతమొందించటం వీలైతే , అంటే ప్రతిదినం వాటి పరంగా మరణించటం వీలైతే , ప్రతి రేపటి దినం పునరుజ్జీవనం సాధ్యపడుతుంది . అలా చేయగలవారు మాత్రమే జీవించి ఉండగా మరణాన్ని తెలుసుకోగలరు అంటారాయన.
ఇలా మన నమ్మకాలు , జ్ణాపకాలు , అనుబంధాలతో కూడిన నేపధ్యం మొత్తాన్ని అంతం చేయటం అంటే , ధ్యానం , సమాధి మొదలైన యోగ ప్రక్రియలలో చెప్పబడే మనసుని అదుపు చేయటం , శూన్య పరచటం లాంటిదన్నమాట . అపుడు మాత్రమే మనలోనికి కొత్తదీ , సృజనాత్మకమైనదీ , సత్యం , దైవం మరేదైనా అనండి అది ప్రవేశించటానికి ఆస్కారముంటుంది . అయితే జిడ్డు కృష్ణమూర్తి గారు దీనిని సాధించే నిమిత్తం ఎవరికీ ఏ ప్రక్రియనీ సూచించరు . ఎవరికి వారు తమ స్వంత మార్గాన్ని అన్వేషించుకోవలసిందే అంటారాయన .
పూర్తిగా చదవండి
మరణభయాన్ని విశ్లేషించి చూస్తే , మరణించేటపుడు పొందవలసిన దేహ బాధ పెట్టే భయం కన్న , మరణం తరువాత నేను ( కూడ బెట్టుకున్న జ్ణాపకాలు , అనుభవాలు , అభిప్రాయాలు వగైరా) మిగలను అనే విషయం తెచ్చే భయమే ఎక్కువ అని తేలుతుంది . మరణం తరువాత మనం ఏమవుతాం ? అనే ప్రశ్నకు నమ్మకమైన సమాధానం లేకపోవటం కూడా మనలో భయానికి మరో కారణం .
మరణం పట్ల మన భయం పోవాలంటే మనలో చాలామందికి మరణం తరువాత ఏదోవిధంగా అంటే సూక్ష్మ దేహమనో , మరోజన్మ అనో ఏదో పేరుతో కొనసాగుతామని నమ్మకం కుదరాలి లేదా కనీసం మరణం తరువాత ఏమవుతుంది? అనే విషయం తెలియాలి . అంటే జీవించి ఉండగానే మరణం అంటే ఏమిటో తెలియాలి . అపుడు చావు భయం చాలా తగ్గుతుంది .
చాలావరకూ మన మతాలన్నీ ఆత్మ శాశ్వతమనీ , పునర్జన్మ అనీ , రకరకాల వివరణలు ఇస్తూ మనం శాశ్వతమనే నమ్మకాన్ని మనలో కలిగిస్తున్నాయి . వాటిద్వారా మనం అందరికీ తెలిసున్న జీవితపు ఈవలి వొడ్డు నుండి ఉందని నమ్ముతున్న మరణం తరువాతి ఆవలి వొడ్డుకు వారధి నిర్మించుకుంటాం . ఏదో విధంగా కొనసాగుతామని నమ్ముతూ మనలో ఉండే మరణభయాన్ని తగ్గించుకుంటాం .
కానీ జిడ్డు కృష్ణ మూర్తి గారు మనం శాశ్వతమని నమ్ముతూ మరణభయం తగ్గించుకోవటం కాకుండా , ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు కాబట్టి మనమూ శాశ్వతం కాదు అని చెప్పడం ద్వారా మరణ భయాన్ని తగ్గించుదామని చూస్తాడు. ఈ ప్రపంచం మొత్తంలో అన్నీ అశాశ్వతమే అయినపుడు మనం మాత్రం శాశ్వతం ఎలా అవుతాం ? అని ప్రశ్నించటమే కాక ఆయన శాశ్వతంగా ఉండటం అనే దానిలో ఉండే అవలక్షణాన్ని కూడా వివరిస్తాడు .
శాశ్వతంగా కొనసాగుతూ ఉండటం అనే దానిలోనే కొత్తదేదీ రాకపోవటం అనే అర్ధం కూడా ఉంది కదా. అలా ఏ కొత్తదనమూ లేకుండా ఎంత కాలం కొనసాగితే మాత్రం ఏమి లాభం ? అంటాడాయన . కొనసాగటం ఆగినపుడే కదా కొత్తదేదైనా ప్రవేశించటం సాధ్యపడేది? పాత విషయాలకు సంబంధించి మనం మరణిస్తే తప్ప కొత్తవీ , సృజనాత్మకమైనవీ ఏవీ మనలోనికి చేరవు. కాబట్టి మనం అంతం కావటానికి భయపడకూడదు . శాశ్వతత్వం మీద ఇష్టాన్ని ఎవరు చంపు కుంటారో వారికి మరణం పట్ల భయం ఉండదు .
సరే , ఇక జీవించి ఉండగానే మరణం అంటే ఏమిటో అది ఎలా ఉంటుందో మనం తెలుసుకోగలమా? అనే ప్రశ్నకు జె. కె. గారు తెలుసుకోగలమనే చెబుతారు. మనకు గల నమ్మకాలనూ , జ్ణాపకాలనూ , అనుబంధాలను అంతమొందించటం వీలైతే , అంటే ప్రతిదినం వాటి పరంగా మరణించటం వీలైతే , ప్రతి రేపటి దినం పునరుజ్జీవనం సాధ్యపడుతుంది . అలా చేయగలవారు మాత్రమే జీవించి ఉండగా మరణాన్ని తెలుసుకోగలరు అంటారాయన.
ఇలా మన నమ్మకాలు , జ్ణాపకాలు , అనుబంధాలతో కూడిన నేపధ్యం మొత్తాన్ని అంతం చేయటం అంటే , ధ్యానం , సమాధి మొదలైన యోగ ప్రక్రియలలో చెప్పబడే మనసుని అదుపు చేయటం , శూన్య పరచటం లాంటిదన్నమాట . అపుడు మాత్రమే మనలోనికి కొత్తదీ , సృజనాత్మకమైనదీ , సత్యం , దైవం మరేదైనా అనండి అది ప్రవేశించటానికి ఆస్కారముంటుంది . అయితే జిడ్డు కృష్ణమూర్తి గారు దీనిని సాధించే నిమిత్తం ఎవరికీ ఏ ప్రక్రియనీ సూచించరు . ఎవరికి వారు తమ స్వంత మార్గాన్ని అన్వేషించుకోవలసిందే అంటారాయన .
పూర్తిగా చదవండి