కలసి ఉంటే కలదు సుఖం. ఇది ఒకప్పటి మాట కానీ ఇప్పుడు పనికి రాదు అని ప్రస్తుత రాజకీయ పార్టీల అభిప్రాయం లాగుంది. విశాలాంధ్ర విడిపోయి ప్రత్యేక రాష్ట్రం కావాలని టి.ఆర్.ఎస్, భా.జ.పా లాంటి పార్టీలు ప్రత్యక్షం గానూ కామ్రేడ్స్ పరోక్షం గానూ, కాంగ్రేస్, టి.డి.పి లు గోడమీద పిల్లి వాటంగా ఎగదోస్తున్న ఈ కుంపటిలో చివరికి ఏమి జరిగినా ఇప్పటివరకూ పార్టీల గొంతులే కానీ సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం వారి వాణి వినిపించే ప్రయత్నమే ఇప్పడివరకూ చేయలేదు. "భారత తెలుగు సంఘం" అట, ...నాకైతే ఇప్పటిదాకా ఈ సంఘం కార్యకలాపాల గురించి తెలియదు కానీ, వారు మటుకు ఈ విషయం మీద ఒక ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నారట. ఈ సేకరణ కేవలం ఇంటర్నెట్ ద్వారానే కాబట్టి దీనిని కేవలం కొందరి ప్రజల అభిప్రాయం గా మాత్రమే పరిగణించగలం. అయితే ఎవరో ఒకరు మొదలు పెట్టారు, సంతోషం. మన వంతుగా మన అభిప్రాయం చెప్పడం ధర్మం. మీరుకూడా "భారత తెలుగు సంఘం" లోకి వళ్ళి మీ అభిప్రాయాన్ని వెల్లడించండి.

రహస్య ప్రణాళిక ఏదైనా ఉందో లేక తన హయాం లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిందన్న అపప్రథ తనకంటుతుందనుకున్నారో (లేదా తను నల్ల సంపాదన అంతా ఆంధ్రమొత్తం విస్తరించి ఉందనో) ఎందుకో గానీ Y.S.R మత్రం ఇప్పటిదాకా కలసిఉండడానికే కట్టుపడ్డారు.
మూలం: ఈనాడు


పూర్తిగా చదవండి