క్విజ్ కి సమాధానాలు
Telugu April 9th, 2008
ఈ క్విజ్ ఎంటి అని అలొచిస్తున్నారా... అయితె ముందు ఇక్కడకి వెళ్ళాలి. సరె ఇక ఆసక్తి విషయానికి వస్తె, నా బ్లాగుకి ఒక 100 హిట్లు పెరిగాయి. కాని సమాధానాలు మాత్రం ఒక 5 గురి దగ్గర నుంచి మాత్రమే... సరె ఇక అసలు జవాబులు కి వచ్చేద్దాం.
1. భాగవతం ఎవరు, ఎవరికీ చెప్పారు.
భాగవతం మొదట్లొ, శౌనకాది మునులంతా సుత గొస్వామిని భగవంతుడి అవతారాల గురించి అడుగుతారు. అప్పుడు సుతుడు వారికి తను , శుఖదేవ గోస్వామి గారు పరీక్షిన్మహారాజు కి చెప్పగా విన్న భాగవతం చెప్తానంటాడు.
ఇప్పుడు జవాబు, రెండింట్లొ ఎదయినా కరెక్టే.
2. అర్జునుడు, అభిమన్యుడి చావుకి వీడె కారణం అని నిక్కచ్చిగా తేల్చి, చంపుతనాని శపథం కూడా చేసాడు.
జయద్రథుడు. ఇతడు సిందూ దేశానికి రాజు కనుక సైందవుడయ్యడు. ఇతడికి శివుడు ఒక వరం ఇస్తాడు. అర్జనుడు తప్ప మిగతా పాండవులని ఒక్క రోజు యుద్దంలొ కట్టడి చెయగలడు. దాని వల్ల అభిమన్యుడు పద్మవ్యూహం లో చనిపొయాడు. పూర్తి కథ మళ్ళా ఎప్పుడైనా చెప్తాను.
౩. గాథాసప్తశతి .
ఇది శాతవాహన రాజైన హాలవృచితుడు లేక హాలుడు రచించాడు. పేరులోనే ఉన్నట్టుగా అది మొత్తం 700 కథల సమాహారం. ముఖ్యంగా గమనించ వలసిందేంటంటే, ఆ కథలు అతను వ్రాయలేదు. కేవలం ఒకచోట చేర్చాడు.
4. సీత పెంపుడు తల్లి, భరత శత్రుగ్నుల ఇల్లాల్ల పేర్ల .
సీత తల్లి పేరు సునయనాదేవి.
భరతుడి భార్య మాండవి. శత్రుగ్నుడి భార్య శృతకీర్తి. వీరిద్దరి జనక మహారాజు తమ్ముని కూతుళ్ళు . అతను యుద్దంలో చనిపొయాక, జనకుడే సొంత కూతుళ్ళ లాగా చూసుకుంటాడు.
5. చాంద్రమాన మాఘ బహుళ త్రయోదశి / చతుర్దశి నాడు వచ్చే పండుగ
ఇది మహాశివరాత్రే. ఇక్కడ త్రయోదశి ఎందుకు ఉందంటే, ఉత్తర భారత దేశంలో కొందరు ఆ రోజు రాత్రి కూడ పూజలు చేస్తారంట.
6. చదరంగం కనిపెట్టింది.
మండోదరి. రావణాసురుడి భార్య. రావణుడు అస్తమానం యుద్దాలకు వెళ్తుంటే, తను ఊరికే ఇంట్లొ ఒక్కతే ఉండలేక చదరంగం కనిపెట్టిందట. రావణాసురుని ఓడించింది అని కూడా అంటారు మరి.
7. జటాయువు , సీతని ఎత్తుకుపోతున్న రావణుని తో పోరాడి ఇక్కడ పడి చనిపోయిందట
అది లేపాక్షి. పేరు లొ కూడ ఉంది చూడండి. రాముడు వచ్చి లే పక్షి అన్నాడంట. (అంటె రాముడికి తెలుగు వచ్చా అని సందేహం రావడం సహజం). ఇది అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి ౧౫ కి.మి దూరం. బెంగుళూరు నుండి చాలా దగ్గర. తప్పక చూడవలసిన ప్రదేశం. దీని గూర్చి మళ్ళా ఎప్పూడైనా టపా వ్రస్తా.
8. చిట్టెలుక
చిఱు + ఎలుక. ఇక్కడ ద్విరుక్తటకారాదేశ సంధి జరిగింది.
ద్విరుక్తటకారాదేశ సంధి : కుఱు-చిఱు-కడు-నడు-నిడు శబ్దముల 'ఱ-డ ' లకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు
ఇక్కడ వంశి మాగంటి గారు చెప్పిన వ్యాఖ్య తప్పక చూడండి. పరుచూరి శ్రీనివాస్ గారు, మీరు బహుమతి తప్పక ఇవ్వ వలసి వచ్చేట్టుంది.
9. జనక రాగాలు
ఇవి మొత్తం 72 . సప్తస్వరాలు కదా. అన్ని స్వరాలు ఉండే రాగాలని జనక రాగాలు అంటారు. వీటినే మేళకర్త రాగాలు అని కూడ అంటారు. 72 ఎలా వచ్చయొ తెలుసా?
10. అజంత భాష
తెలుగుతొ పాటు, ఇటాలియన్ కూడ అజంత భాష. అందుకే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. మరి ఇటాలియన్ ని తెలుగు ఆఫ్ ద వెస్ట్ అని ఎందుకు అనరో?
సరే ఈ క్విజ్ కి సమాధానాలు పంపిన వారు , వంశి మాగంటి గారు, ఒక అనామకుడు గారు, సుజాత గారు , రాజశేఖర్ గారు మరియ ముక్కు శ్రీ రాఘవ కిరణ్ శర్మ గారు. ఎవరు ఎన్ని కరక్టో చెప్పాలంటారా?
మీ అందరికి నా తరుపున అభినందనలు మరియు నెనర్లు కూడా.
పూర్తిగా చదవండి
1. భాగవతం ఎవరు, ఎవరికీ చెప్పారు.
భాగవతం మొదట్లొ, శౌనకాది మునులంతా సుత గొస్వామిని భగవంతుడి అవతారాల గురించి అడుగుతారు. అప్పుడు సుతుడు వారికి తను , శుఖదేవ గోస్వామి గారు పరీక్షిన్మహారాజు కి చెప్పగా విన్న భాగవతం చెప్తానంటాడు.
ఇప్పుడు జవాబు, రెండింట్లొ ఎదయినా కరెక్టే.
2. అర్జునుడు, అభిమన్యుడి చావుకి వీడె కారణం అని నిక్కచ్చిగా తేల్చి, చంపుతనాని శపథం కూడా చేసాడు.
జయద్రథుడు. ఇతడు సిందూ దేశానికి రాజు కనుక సైందవుడయ్యడు. ఇతడికి శివుడు ఒక వరం ఇస్తాడు. అర్జనుడు తప్ప మిగతా పాండవులని ఒక్క రోజు యుద్దంలొ కట్టడి చెయగలడు. దాని వల్ల అభిమన్యుడు పద్మవ్యూహం లో చనిపొయాడు. పూర్తి కథ మళ్ళా ఎప్పుడైనా చెప్తాను.
౩. గాథాసప్తశతి .
ఇది శాతవాహన రాజైన హాలవృచితుడు లేక హాలుడు రచించాడు. పేరులోనే ఉన్నట్టుగా అది మొత్తం 700 కథల సమాహారం. ముఖ్యంగా గమనించ వలసిందేంటంటే, ఆ కథలు అతను వ్రాయలేదు. కేవలం ఒకచోట చేర్చాడు.
4. సీత పెంపుడు తల్లి, భరత శత్రుగ్నుల ఇల్లాల్ల పేర్ల .
సీత తల్లి పేరు సునయనాదేవి.
భరతుడి భార్య మాండవి. శత్రుగ్నుడి భార్య శృతకీర్తి. వీరిద్దరి జనక మహారాజు తమ్ముని కూతుళ్ళు . అతను యుద్దంలో చనిపొయాక, జనకుడే సొంత కూతుళ్ళ లాగా చూసుకుంటాడు.
5. చాంద్రమాన మాఘ బహుళ త్రయోదశి / చతుర్దశి నాడు వచ్చే పండుగ
ఇది మహాశివరాత్రే. ఇక్కడ త్రయోదశి ఎందుకు ఉందంటే, ఉత్తర భారత దేశంలో కొందరు ఆ రోజు రాత్రి కూడ పూజలు చేస్తారంట.
6. చదరంగం కనిపెట్టింది.
మండోదరి. రావణాసురుడి భార్య. రావణుడు అస్తమానం యుద్దాలకు వెళ్తుంటే, తను ఊరికే ఇంట్లొ ఒక్కతే ఉండలేక చదరంగం కనిపెట్టిందట. రావణాసురుని ఓడించింది అని కూడా అంటారు మరి.
7. జటాయువు , సీతని ఎత్తుకుపోతున్న రావణుని తో పోరాడి ఇక్కడ పడి చనిపోయిందట
అది లేపాక్షి. పేరు లొ కూడ ఉంది చూడండి. రాముడు వచ్చి లే పక్షి అన్నాడంట. (అంటె రాముడికి తెలుగు వచ్చా అని సందేహం రావడం సహజం). ఇది అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి ౧౫ కి.మి దూరం. బెంగుళూరు నుండి చాలా దగ్గర. తప్పక చూడవలసిన ప్రదేశం. దీని గూర్చి మళ్ళా ఎప్పూడైనా టపా వ్రస్తా.
8. చిట్టెలుక
చిఱు + ఎలుక. ఇక్కడ ద్విరుక్తటకారాదేశ సంధి జరిగింది.
ద్విరుక్తటకారాదేశ సంధి : కుఱు-చిఱు-కడు-నడు-నిడు శబ్దముల 'ఱ-డ ' లకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు
ఇక్కడ వంశి మాగంటి గారు చెప్పిన వ్యాఖ్య తప్పక చూడండి. పరుచూరి శ్రీనివాస్ గారు, మీరు బహుమతి తప్పక ఇవ్వ వలసి వచ్చేట్టుంది.
9. జనక రాగాలు
ఇవి మొత్తం 72 . సప్తస్వరాలు కదా. అన్ని స్వరాలు ఉండే రాగాలని జనక రాగాలు అంటారు. వీటినే మేళకర్త రాగాలు అని కూడ అంటారు. 72 ఎలా వచ్చయొ తెలుసా?
10. అజంత భాష
తెలుగుతొ పాటు, ఇటాలియన్ కూడ అజంత భాష. అందుకే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. మరి ఇటాలియన్ ని తెలుగు ఆఫ్ ద వెస్ట్ అని ఎందుకు అనరో?
సరే ఈ క్విజ్ కి సమాధానాలు పంపిన వారు , వంశి మాగంటి గారు, ఒక అనామకుడు గారు, సుజాత గారు , రాజశేఖర్ గారు మరియ ముక్కు శ్రీ రాఘవ కిరణ్ శర్మ గారు. ఎవరు ఎన్ని కరక్టో చెప్పాలంటారా?
మీ అందరికి నా తరుపున అభినందనలు మరియు నెనర్లు కూడా.
పూర్తిగా చదవండి