మద్య మాంస భక్షణ గురించి.....

గతంలో నేను రాసిన వలసవాదం లో మ్లేచ్చ పద సందర్భంలో మాంస భక్షణ ప్రస్తావన వచ్చింది.మిత్రులు బ్రాహ్మణులు కూడా గోమాంసం తిన్నవారేగా?అని కూడా అన్నారు.కొన్ని ప్రమాణాలు కూడా సూచించారు.వాటిని నేను కనుగొనలేక పోయాను.

ఈ విషయం నా మిత్రులవద్ద చర్చకు వచ్చింది. అందులో ఒక మిత్రుడు అన్నాడు...

"గతంలో బ్రాహ్మణులు మద్యమాంసాలు తిన్నారనడానికి నిదర్శనాలు ఉన్నాయి.
1. శుక్రాచార్యుడు మద్యం తాగిన తర్వాతనే కదా మద్యాన్ని నిషేధించింది? 2. పితృ దైవత కార్యములం దతి భక్తిని మాంసమిడుట ధర్మమనియు...శేషాన్ని ప్రీతిగా తినాలని శాస్త్రాల్లో ఉందనీ.. ధర్మవ్యాధోపాఖ్యానం. (భారతం-ఆధారం)

కాబట్టి మద్యమాంసాలను బ్రాహ్మణులూ తినాల్సిందే".
దానికి నేనన్నాను మిత్రునిగా నన్ను తినేట్టుగా చెయ్యాలనుకుంటే అది వేరు కాని... సిద్ధాంతాన్ని అందరికీ అంతగట్టడం ఎందుకు? అని...
పూర్తిగా చదవండి