నందమూరి వారి దన్నుతో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఆకాశమే అంచుగా సాగుతున్న అధికార పార్టీ అవినీతి కి వ్యతిరేకంగా సకల అస్త్ర శస్త్రాలతో టి.డి.పి. దండయాత్ర "మీకోసం" మొదలయింది. పైకి చెప్పే ఉద్దేశం ఏదైనా, ఓట్ల కోసమే ఈ పాట్లన్నది ఎవరూ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ యాత్రలో చంద్రబాబు అజెండా అధికార కాంగ్రేస్ పార్టీ అవినీతే గాక సామాన్యుడిని కాల్చేస్తున్న ధరల మంటలు, Y.S.R బంధుప్రీతి, SEZ ల పేరుతో వేలకొద్దీ ఎకరాల భూములను భోంచేస్తున్న భూబకాసురులు, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు మొదలైనవి ముఖ్యమైనవి.(శాంతి భద్రతల విషయంలో మన రాష్ట్రం దాదాపు బీహార్ లా తయారవుతోందని మాటల సందర్భంలో మా మిత్రులు కొదరు బాధపడుతుంటారు). ఎన్నడూ లేని విధంగా ఈసారి చంద్రబాబుకి నందమూరి వంశస్తుల నుండి దాదాపు పూర్తి మద్దతు లభిస్తున్నది. బాలక్రిష్ణ, హరిక్రిష్ణ ముదలైన పెద్ద తలకాయలేకాక కళ్యాణ్ రామ్, జూ ఎన్.టి.ఆర్ లాంటి పిల్ల తలకాయలు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. అయితే నెలక్రితం దాకా సీన్ లో లేని వీళ్ళు ఒకేసారి తెరమీదకు రావడానికి కారణం ఏమిటి? బాలక్రిష్ణ తో చంద్రబాబు సయోధ్య కొన్నేళ్ళ క్రితమే ఏర్పడింది. లోగుట్టు ఏమిటంటే బాలక్రిష్ణ ఇంటిలో కాల్పుల సంఘటన మూసివేసినందుకు ప్రతిఫలంగా బాలక్రిష్ణ కూతురు ని చంద్రబాబు కొడుకు లోకేష్ కి ఇచ్చారు. అప్పట్లో మిగిలిన నందమూరి వంశస్తులు చంద్రబాబు తో పెద్దగా కలవలేదు. గత కొద్ది నెలల నుండి చంద్ర బాబు పార్టీ లో కొంత ఇబ్బందికర పరిస్థితి ని ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా టి.డి.ఎల్.పి ఉపనేత దేవేందర్ గౌడ్ నుండి. ప్రస్తుత విషయం తీసుకుంటే, నందమూరి వంశస్థుల ఆగమనం దేవేందర్ గౌడ్ కి చెక్ పేట్టేందుకేనా? ఒకవేళ ఆంధ్రరాష్ట్రం ముక్కలయ్యే పరిస్థితే వస్తే ఆ కొత్త రాష్ట్రాలలో కూడా తన బంధువులే అధికారంలో ఉండాలనే ఉద్దేశంతోనే వారిని ఆహ్వానించారా? ఏదేమైనా "బెస్ట్ ఆఫ్ లక్" చంద్రబాబూ!

పూర్తిగా చదవండి