రాయలసీమ రతనాలసీమ. రతనాలకంటే విలువైన జానపద సాహిత్యానికి కూడా ఈ సీమే ప్రసిద్ధి. జానపద సాహిత్యం అక్షర ఙ్ఞానం లేని పల్లీయుల సాహిత్యం. మనదేశంలో నూటికి 75 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్తూ పల్లెల్లోనే జీవిస్తున్నారు. శిష్ట సాహిత్యాన్ని మనమెంత చదువుకున్నా మన తెలుగు సాహిత్యంలోని సౌరభాల్ని, స్వచ్ఛతను, తియ్యదనాలను రుచి చూడాలంటే జానపద సాహిత్యాన్ని పరిశీలించక తప్పదు. జానపద సాహిత్యం రోజురోజుకు అంతరించిపోతోంది. దీనిని కనీసం భద్రపరచాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఆంధ్ర [...]
పూర్తిగా చదవండి