Apr 09
ఎవరి చావు వారు చస్తే తప్పేంటి ?-7
అవశ్యమ్ అనుభోక్తవ్య తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
ఆమె చనిపోయిన విషయం గుర్తొచ్చి రామభద్రానికి తానిప్పుడు చూస్తున్నది భోజేశ్వరి ప్రేతాత్మనన్న విషయం స్పష్టంగా ఆకళింపైపోయింది. భయంతో కళ్ళు పెద్దవిచేసుకుని నోరు తెఱుచుకుని నిశ్చేష్టుడై ఆమెవంక చూస్తున్నాడు. "ఎందుకు భద్రం భయపడుతున్నావ్ ?" అని భోజేశ్వరి నవ్వుతూ గాలిలో కలిసిపోయి అంతర్ధానమైంది. అంతే ! పెరుగూ విరుగూ అన్నీ మర్చిపోయి రామభద్రం ఇంటికేసి పరుగో పరుగు. ఇంట్లోకి రాకముందే మెట్లదగ్గరే పడిపోయాడు. అసలు తాను ఇంటికెలా చేరుకున్నాడో తనకే తెలియదు. అందరూ ఆందోళనతో అతన్ని లేవదీసి లోపలికి మోసుకెళ్ళారు. ఎలా వచ్చిందో గాని అప్పటికప్పుడు 102 డిగ్రీల మాయదారి జ్వరం, రామభద్రం మూసిన కన్ను తెఱవకుండా మూడ్రోజులు పడుకున్నాడు. ఒంట్లో కాస్త కులాసా చిక్కింతర్వాత తాను చూసినది ఉన్నదున్నట్లు చెబితే ఎవ్వరూ నమ్మలేదు. వాళ్ళ నాన్న అప్పారావు చాలా సంవత్సరాల్నుంచీ నైట్ డ్యూటీలకెళుతున్నాడు. ఆయనకెప్పుడూ ఏ దెయ్యాలూ ఎదురుకాలేదు. అందుకని ఆయన కలాంటి నమ్మకాలేమీ లేవు. "పిఱికి నా కొడకా ! ఏదో చూసి ఏదో అనుకుని బాగా జడుసుకున్నావులే గాని, ఇంక నోర్ముయ్యెహె !"అని కసిరాడు. తండ్రికి తగ్గ కొడుగ్గా రామభద్రానికీ పెద్దగా నమ్మకాల్లేవు. కాని తాను ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి