Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ధ్వజం!…8

ధ్వజం (కథ) వింజమూరి విజయకుమార్
“అర్ధం కావడం లేదు తాతగారూ!” అన్నాడు కృష్ణమూర్తి. అతడి గొంతు గాద్గధికమైంది. “ఒక మంచి కుటుంబం నాది. అర్ధంచేసుకునే భార్య, చక్కటి పిల్లలు. సాయంత్రం యింటికి రాగానే నాపైకెక్కి ఆడుకునే వాళ్ళు. ఎప్పుడూ గలగలా మాట్లాడే తల్లి. . . అందరూ భూకంపం పాలయ్యారు. ఒంటరిగా నన్ను శోకంలో వదిలారు. గతం వెంటాడుతోంది తాతగారూ. పడుకుంటే నిద్రరాదు. మేలుకునుంటే అవే జ్ఞాపకాలు. శరీరం మీద సృహ వుండదు. ఎందుకీ జీవితం. . .నా వాళ్ళు
పూర్తిగా చదవండి

ధ్వజం - 7

ధ్వజం (కథ) వింజమూరి విజయకుమార్
మహారధి జీవిత వృత్తాంతం విని, కృష్ణమూర్తి విభ్రాంతి చెందాడు! మాధవరావుకి అది తెలిసిందే అయినా మళ్ళీ విన్నాడు. వినేప్పుడు మనసు మళ్ళీ ఆర్ధ్రమయింది. కన్నీరు వుబికింది. కృష్ణమూర్తి ఆ వృద్దుడి వైపు ఒకసారి పరిశీలనగా చూశాడు. అస్తమిస్తున్న సూర్యకాంతి ఆయన పొడవైన ముక్కుమీద పడి ప్రతిఫలిస్తోంది. చల్లటి వాయుపవనం తాకి ఆయన వెండి జుట్టు పొడిగా రెప రెప లాడుతోంది. ముఖంలో ఏదో తెలీని శాంతి కనబడుతోంది. కధ చెప్తున్నంత
పూర్తిగా చదవండి

ధ్వజం!..‍6

ధ్వజం (కథ) వింజమూరి విజయకుమార్
పెద్దమ్మాయి చనిపోయేనాటికి మూడో అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తోంది. మా వూర్లో కాలేజీ లేనందువల్ల అక్కడికి ఓ యాభై మైళ్ళ దూరంలో వున్న జిల్లా హెడ్ క్వార్టర్సులో ‘లేడీస్ కాలేజీ’లో చేర్పించినాను. ఆ కాలేజీకి హాస్టల్ ఫెసిలిటీ వుండేది. అందువల్ల హాస్టల్లో వుంటూ చదువు సాగించింది. పెద్దమ్మాయి శవం కారులో యిల్లు చేరిన రోజున ఆ చావు వార్త తెలుపమని ఒక మనిషిని బస్సెక్కించి, అక్కడ హాస్టల్ కి పంపించినాను. అదే నేను చేసిన
పూర్తిగా చదవండి

ధ్వజం! –5

ధ్వజం (కథ) వింజమూరి విజయకుమార్
తర్వాత, తొమ్మిదేళ్ళలో సువర్చల మరో ఆరుమందికి జన్మనిచ్చింది. వాళ్ళలో పెద్ద వాళ్ళిద్దరూ మగపిల్లలు. తర్వాతి ముగ్గురూ ఆడపిల్లలు. చివరివాడు మళ్ళీ మగవాడే. కానీ, బాబూ కృష్ణమూర్తీ ఆ చివరివాడున్నాడే వాడు అసాధారణమైన సౌందర్యం గలవాడు. అద్బుతమైన రూపవంతుడు. “కాకి పిల్ల కాకికి ముద్దం”టారు. “హంస పిల్ల అందరికీ ముద్దే”నని వాడు పుట్టిన ఒకటిన్నర సంవత్సరం లోనే నిరూపించినాడు. ఆ చుట్టుప్రక్కల వూర్లలో వుండే ప్రజలంతా
పూర్తిగా చదవండి

ధ్వజం –4

ధ్వజం (కథ) వింజమూరి విజయకుమార్
భూకంప విపత్తు సంభవించే సమయానికి ఆదృష్టవశాత్తూ మాధవరావు వూర్లో లేడు. ఏవో పొలం సంబంధమైన పనులమీద భార్యా పిల్లల్తో సహా అక్కడికి ఆరొందల కిలోమీటర్ల దూరంలోనున్న తన స్వగ్రామం వెళ్ళేడు. అక్కడ భూకంప ప్రభావం లేదు. అయితే ప్రాణ నష్టం ఏదీ లేకపోయినా, ఆస్తి నష్టం మాత్రం అతడికి బాగానే జరిగింది. కృష్ణమూర్తి లాగే అతడి యిల్లు ధ్వంసమయింది. ఇంట్లో వున్న డబ్బు, బంగారం, ఫర్నిచర్ లాంటివన్నీఅతడొచ్చి చూసుకునే సరికే దొంగలు
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS