మూణ్ణెల్ల ముచ్చటఆంధ్రరాష్ట్రం వచ్చిన కొత్తల్లో వెంకటేశ్వర్లుగారి మిత్రుడైన సుబ్బారావుగారికి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వోద్యోగం వచ్చింది.ఆయన వెంటనే రాష్ట్ర రాజధాని (కర్నూలు)కి వెళ్ళి ఉద్యోగంలో చేరిపోయారు.అక్కడ ఇంకా చాలా ఉద్యోగ ఖాళీలున్నాయి. "మంచివాళ్ళని చూడవయ్యా"అని ఆయన పనిచేసే విభాగపు అధిపతి సుబ్బారావుగారితో చెప్పాడు."సరే"నని సుబ్బారావుగారు గుంటూరొచ్చి "ఒరేయ్ ! వెంకులూ ! మా సెక్షన్‌లో ఓ వేకెన్సీ ఉంది.వస్తావా ?"అని అడిగారు.భూస్వామి కావడంచేత ఒకరి కింద ఉద్యోగం చెయ్యడమంటే వెంకటేశ్వర్లుగారికి సుతరామూ మనస్కరించింది కాదు.మొదట్లో తటపటాయించినా"గుంటూరులో ఊరికే కూర్చుంటే కాలక్షేపం కావడంలే"దనుకుని మిత్రులతో కలిసి వెరైటీగా కర్నూలులో గడిపినట్లుంటుందనే యువక ఆలోచనలతో "సరే"నన్నారు.అలా కలిగింది వెంకటేశ్వర్లుగారి తొలి ఉద్యోగానుభవం 1953లో, ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వంలో !అప్పట్లో కర్నూలు ఇంత మహానగరం కాదు.సౌకర్యాలు పూజ్యం.కేంద్రప్రభుత్వాన్ని మెడలొంచి సాధించుకున్న ఆంధ్రరాష్ట్ర పరిస్థితి లేచిపోయి పెళ్ళిచేసుకున్నవాళ్ళ కాపరంలాగా ఉండేదన్నారు వెంకటేశ్వర్లుగారు. అందుచేత రాష్ట్ర సచివాలయం ఓ ఆరుబయటి మైదానంలో 4000 (అక్షరాలా నాలుగువేల) గుడారాల (tents)లో నడుస్తూండేది.కర్నూలులో ఒక పాత ప్రభుత్వ భవనాన్ని రాష్ట్ర శాసనసభగా వాడేవారు.జిల్లా కలక్టరు కార్యాలయ సముదాయాన్ని రాజ్‌భవన్‌గా వాడేవారు.ఉద్యోగుల్లో ...
పూర్తిగా చదవండి