Aug 18
ఒక డాక్టరుగారి కథ-1 గుంటూరుజిల్లా రేపల్లెలో సుబ్బా…
మా నాన్నగారి స్మృతు తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
ఒక డాక్టరుగారి కథ-1గుంటూరుజిల్లా రేపల్లెలో సుబ్బారావుగారనే డాక్టరుగారుండేవారు.ఆయన వెంకటేశ్వర్లుగారికి దగ్గరి బంధువు.నిజానికాయన ఎమ్.బి.బి.ఎస్.డాక్టర్ కాదు.ఆరోజుల్లో L.I.M అనే వైద్యపట్టా ఒకటుండేది.అది చదవడం కోసం మద్రాసు వెళ్ళేవారు.ఆయన కూడా అలా మద్రాసు వెళ్ళి L.I.M. లో చేరాడు. ఇది నెహ్రూ భారతదేశపు అధికార పగ్గాలు చేపట్టిన కొంతకాలానికి జరిగింది.దేశంలో - ముఖ్యంగా పల్లెపట్లలో ఆధునిక వైద్య సౌకర్యాల కొఱత ఉందనే దృష్టితో నెహ్రూ ప్రభుత్వం అప్పట్లో ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. అదేంటంటే-వైద్యవిద్యలో శిక్షణ పొందుతున్న సీనియర్ విద్యార్థులందరికీ శిక్షణ పూర్తి కాకముందే తక్షణం వైద్యపట్టాలిచ్చేసి పల్లెపట్లకు వైద్యులుగా పంపడం.అనుకున్నారో లేదో వెనువెంటనే అమలు చేసేశారు.అప్పట్లో రేపల్లె మునిసిపాలిటీ కాదు.పల్లెప్రాంతం కిందనే లెక్క.కాబట్టి తాను స్వగ్రామంలో ప్రాక్టీసు పెడతానని చెప్పి సుబ్బారావుగారు కూడా తన వైద్యపట్టాని ముందే పుచ్చుకుని తిరిగొచ్చేశారు.ఆయన మంచి తెలివైనవాడు.వైద్యాన్ని పూర్తికాలం పాటు అభ్యసించకపోయినా (పాతకాలం భాషలో చెప్పాలంటే)"గొప్ప హస్తవాసి"గల ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి