Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పోలేపల్లి విషాదగాథల బాధ్యులెవరు?

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
అభివృద్ధిపథం అనబడేదానిమీద సరికొత్తవెలుగులు అందుకుంటున్నదెవరు? మరింత చీకట్లోకి కుంగిపోతున్నదెవరు? హైదరాబాదు అలంకరించుకున్న సరికొత్తనగ అనీ, హైదరాబాదును అంతర్జాతీయ స్థాయికి ఎగరేయబోతున్న అత్యాధునిక నిర్మాణమనీ ఊదరకొడుతున్న శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో, హైదరాబాదునుంచి దక్షిణంగా వెళ్లే జాతీయరహదారిమీద దేశదేశాల సంపన్నుల పెట్టుబడులు ప్రవహించి రాష్ట్రాన్నీ, దేశాన్నీ అందలాలెక్కిస్తాయనీ అమెరికాతో సమానంచేస్తాయనీ ఏలినవారూ వారిబంట్లూ నమ్మబలుకుతున్న దారి పక్కన ఏం జరుగుతున్నదో చూడండి. నిన్నటిదాకా మనుషులు కలకలలాడినచోట సమాధులు లేచి నిలుస్తున్నాయి. అంతులేని విషాదం విస్తరిస్తోంది. పల్లె కన్నీటిధారలు [...]
పూర్తిగా చదవండి

ధరలు పైపైకి ఎక్కడికి వెళతాయి?

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
ఎన్నికల సంవత్సరం మొదలయింది గనుక రాజకీయ పక్షాలన్నిటికీ ప్రజల మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకువస్తోంది. ప్రజాసమస్యల మీద ఆందోళనలకు దిగడమూ, ఆ సమస్యల పరిష్కారానికి చిట్కాలు తమదగ్గర మాత్రమే ఉన్నాయనీ, అవతలిపక్షం ఆ సమస్యలను పరిష్కరించజాలదనీ అనడమూ రోజురోజుకూ ధరల లాగ, పాపంలాగ పెరిగిపోతున్నాయి. లోక్ సభకూ, అనేక రాష్ట్రాల శాసనసభలకూ పద్ధతి ప్రకారం జరిగినా సార్వత్రిక ఎన్నికలు సరిగ్గా పన్నెండు నెలల్లోకి వచ్చేశాయి. మరికాస్త ముందుకు జరుగుతాయని కూడ అంటే ఏడెనిమిది నెలల లోపే జరగవచ్చుననీ [...]
పూర్తిగా చదవండి

బియ్యం పథకం ఔదార్యం కాదు, అనివార్యం

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
రాష్ట్రప్రభుత్వం మళ్లీ ఒకసారి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించింది. ఇరవై ఐదు సంవత్సరాల కింద కొత్తగా రాజకీయాలలోకి ప్రవేశిస్తూ ఎన్ టి రామారావు ప్రారంభించిన ఈ పథకం అప్పటినుంచి ఇప్పటివరకు అనేకమంది ముఖ్యమంత్రుల కింద అనేక రకాలుగా మారుతూ వచ్చి డా. వై ఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో మళ్లీ మొదటికి వచ్చింది.
పూర్తిగా చదవండి

గాలిమోటర్లఅడ్డా నిండా గాలి!

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
హైదరాబాదులో ఏడు దశాబ్దాలుగా పనిచేస్తున్న బేగంపేట గాలిమోటర్ల అడ్డాను తోసిరాజంటూ కొత్త అడ్డా వచ్చింది. వారం రోజుల కింద యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ అధినేత్రి సోనియాగాంధీ ప్రారంభించిన ఆ అడ్డా అధికారిక పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. నిర్మాణ వ్యయం రు. 1418 కోట్ల అంచనాతో మొదలయి, త్వరలోనే రు. 1760 కోట్ల వ్యయ అంచనాకు చేరినాక పనులు మొదలయి, ప్రస్తుతానికి రు. 2,478 కోట్ల వ్యయంతో ముగిసింది. సాలీనా ఒకకోటీ ఇరవై లక్షల మంది [...]
పూర్తిగా చదవండి

అబ్బ, రైతులకు ఎన్నివేల కోట్లు !?

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
రైతులకు రుణమాఫీ, రుణాల చెల్లింపులో రాయితీల పద్దు కింద ఈ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ లో అరవైవేల కోట్ల రూపాయల సహాయం అందించబోతున్నామని, ఇంతటి మహత్కార్యానికి దేశమంతా నీరాజనాలు పలకవలసి ఉందని బడ్జెట్ ఉపన్యాసంలో కేంద్ర ఆర్థికమంత్రి పి చిదంబరం అన్నారు. పైపైన చూస్తే, అరవైవేలకోట్ల రూపాయలు అనే పెద్దఅంకెచూస్తే అదేదో రైతులకు, దేశ వ్యవసాయరంగానికి చేస్తున్న గొప్ప మేలు లాగనే కనబడుతుంది. కాని తీగలాగి డొంక కదిలిస్తే ఈ ప్రకటన బండారం బయటపడుతుంది. ఈ భారీ [...]
పూర్తిగా చదవండి

లక్ష్య ప్రకటనలు పెదాలమీదనేనా?

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
కేంద్ర ఆర్థిక మంత్రి పళనియప్పన్ చిదంబరం స్థానిక వివేకానికి తిరువళ్లువార్ నూ, దేశభక్తికి సుబ్రహ్మణ్య భారతినీ ఉటంకిస్తూ బడ్జెట్ ఉపన్యాసం చదువుతారని గతవారం నేను చేసిన ఊహాగానంలో సగమే నిజమయింది. ఆయన తిరువళ్లువార్ ను ఉటంకించారు గాని ఆ రెండువేలసంవత్సరాల కిందటి మహాకవి నుంచి సుపరిపాలన నిర్వచనాన్ని అరువు తెచ్చుకున్నారు. సుబ్రహ్మణ్య భారతిని అసలే ఉటంకించలేదుగాని బడ్జెట్ ఉపన్యాస ప్రారంభంలో ఇందిరా ప్రియదర్శినిని, చివరిలో జవహర్లాల్ నెహ్రూనూ ఉటంకించి ఆద్యంతాలలో నెహ్రూ కుటుంబమే ఉన్నదని, ఉంటుందని ఎన్నికల [...]
పూర్తిగా చదవండి

సెజ్ ల రద్దులో గోవా దారి

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
ప్రత్యేక ఆర్థిక మండలాలను రద్దుచేస్తూ, తన పరిధిలో ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయబోనంటూ గోవా రాష్ట్రప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంలో గోవా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రజల ఒత్తిడివల్ల తీసుకోక తప్పని నిర్ణయం, ఒక ఆశావహమైన మార్పుకు సంకేతంగా ఉంది. గోవా మూవ్ మెంట్ అగెనెస్ట్ సెజ్ (జి ఎం ఎ ఎస్) అనే విభిన్న సంస్థల, రాజకీయ పక్షాల ఐక్య సంఘటన గత కొద్ది కాలంగా చేస్తున్న ఆందోళన ఫలించి ప్రభుత్వం [...]
పూర్తిగా చదవండి

ఇక రవాణా ధనయజ్ఞం !

ParamarthaSatyam ఎన్.వేణుగోపాల్
‘బస్సుచక్రం ప్రజాప్రగతికి చిహ్నం’ అనే మాట చూడని వారెవరూ మన రాష్ట్రంలో ఉండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడిపే బస్సులమీద ఉండే ఆ సంస్థ చిహ్నంలో ఈమాట ఉంటుంది. ఈ సంస్థ 1950 రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ఆక్ట్ ప్రకారం 1958 జనవరి 11 న పుట్టింది. ఇంకొక రెండువారాల్లో యాభయవ పడిలో పడబోతున్న ఈ సంస్థ తాను ఎందుకు పుట్టానో మరిచిపోతున్నట్టుంది. దాని పుట్టుకకు కారణమైన చట్టం ప్రయాణికుల రవాణా బాధ్యత [...]
పూర్తిగా చదవండి

ఎంత గొప్ప ప్రణాళిక!

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
పదకొండవ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను జాతీయ అభివృద్ధి మండలి ఎట్టకేలకు బుధవారం నాడు ఆమోదించింది. నూతన ఆర్థిక విధానాల తర్వాత అసలు మన రాజకీయార్థిక పాలనా విధానాలలో ప్రణాళికల పద్ధతే నిర్లక్ష్యానికి గురవుతున్నది గనుక, ప్రణాళికలలో ఏమి రాసినా వాటిని పాటించడం లేదు గనుక ఈ ఆమోదాన్ని ‘ఎట్టకేల’కు అనవలసి వస్తున్నది. అంతేకాదు, ఈ పదకొండవ పంచవర్ష ప్రణాళిక ముసాయిదా మీద కసరత్తు చాల రోజులుగా సాగుతున్నది, ఒక నెల కిందనే కేంద్ర మంత్రివర్గం దీన్ని ఆమోదించింది, [...]
పూర్తిగా చదవండి

చెరకు రైతుల బతుకు చేదు

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
వరి మద్దతుధర గురించి ఆందోళనలకు పరిష్కారం దొరకకముందే చెరకు ధర గురించి రైతుల ఆందోళన మొదలు కాబోతున్నది. ఇప్పటికే జహీరాబాద్ ప్రాంతానికి చెందిన చెరకు రైతు దశరథ్ గత సంవత్సరం కర్మాగారానికి తోలిన చెరకుకు ఇప్పటికీ చెల్లింపులు జరగక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేకించి చెరకు రైతుల సమస్యల గురించి, మొత్తంగా రైతాంగ సమస్యల గురించి పాలకుల దృష్టికి తేవడం కోసం డి వసంత్ కుమార్ జహీరాబాద్ నుంచి ఢిల్లీ దాకా పాదయత్ర జరిపి అక్కడ అన్ని రాజకీయ [...]
పూర్తిగా చదవండి

నిజాం పాలన రాజకీయార్థిక కోణాలు

ParamarthaSatyam, Telangana, Telugu ఎన్.వేణుగోపాల్
నిజాం పాలన గురించి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కె చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్య, ఆ తరువాత ఆయన, ఆయన సహచరులు దాన్ని సమర్థించుకుంటున్న తీరు, వివిధ రాజకీయ పక్షాల స్పందన మన రాజకీయ రంగంలోని దివాళాకోరుతనానికి అద్దం పడుతున్నాయి. హైదరాబాదు రాజ్య చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వర్ధంతి సందర్భంగా ఒక రాజకీయ మర్యాదగా హాజరు కావడం, మిగిలిన గతకాలపు పాలకులందరినీ గౌరవించినట్టే గౌరవించడం ఒక ఎత్తు. కాని ఆ పాలకుడికి సంబంధించిన [...]
పూర్తిగా చదవండి

కాగ్ నివేదికల ప్రయోజనమేమిటి?

ParamarthaSatyam, Reports, Telugu ఎన్.వేణుగోపాల్
ఈ సంవత్సరం కూడ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదికలు రాష్ట్రప్రభుత్వ ఆర్థిక నిర్వహణను తప్పుపట్టాయి. ఒకరకంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విపరీతంగా పెరిగిపోయిన అవినీతి గురించి చాలమంది చాలరోజులుగా మాట్లాడుతున్న విషయాలనే కాగ్ నివేదికలు మరొకసారి నిర్ధారించాయన్నమాట. అధికారపక్షాన్ని విమర్శించడానికి ఏ ఆధారం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు అయాచితంగా ఒక అవకాశం దొరికింది. రెండురోజులుగా ప్రచార సాధనాలనిండా కాగ్ నివేదికల మీద దుమారమే రేగుతోంది.
పూర్తిగా చదవండి

ఎవరి జేబులోంచి ఈ సబ్సిడీలు?

News Archives, ParamarthaSatyam, Surya, Telugu ఎన్.వేణుగోపాల్
గత గురువారం న్యూఢిల్లీలో పదకొండవ పంచవర్ష ప్రణాళికను ఆమోదించడానికి ఏర్పాటయిన సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ దేశంలో ఆహారానికి, ఎరువులకు, పెట్రోలియం ఉత్పత్తులకు ఇస్తున్న సబ్సిడీల భారం పెరిగిపోతున్నదన్నారు. ఈ సంవత్సరం అది లక్షకోట్ల రూపాయలకు చేరిందని వాపోయారు. ఈ సబ్సిడీలను తగ్గించే విషయమై మంత్రివర్గ సహచరులు, ప్రణాళికాసంఘం సభ్యులు ఆలోచించాలని ఉద్బోధించారు. ఈ సబ్సిడీల భారాన్ని భరించడమంటే అర్థం తక్కువ పాఠశాలలు, తక్కువ ఆస్పత్రులు, తక్కువ స్కాలర్ షిప్పులు, తక్కువ వ్యవసాయ [...]
పూర్తిగా చదవండి

ప్రత్యేక ఆర్థిక మండలాల నష్టాలు

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
ప్రభుత్వాలు తీసుకునే రాజకీయార్థిక విధానాలు, నిర్ణయాలు దేశప్రజలందరి జీవితాలమీద తీవ్రమైన ప్రభావాన్ని వేస్తాయి. కొందరికి మేలు కలిగిస్తాయి, కొందరికి కీడుకలిగిస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును మార్చివేస్తాయి. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో అప్పటివరకూ ఉన్న స్థితిని మంచివైపుకో, చెడువైపుకో తోస్తాయి. అవి ఇంత ప్రభావశీలమైనవి అయినప్పటికీ వాటి గురించి జరగవలసినంత పెద్ద ఎత్తున చర్చ జరగదు.
పూర్తిగా చదవండి

సెన్సెక్స్ ఉత్థానం పతనం వైపేనా?

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
నిరాశనూ నిరుత్సాహాన్నీ పెంచడానికి కాదు గాని, ఏ బలమైన కారణమూ లేకుండా సెన్సెక్స్ రోజు రోజూ పైకి పైపైకి పరుగులు పెడుతుంటే భయం కలుగుతున్నది. సెన్సెక్స్ పైకి పోతున్న ఆ గ్రాఫు మనకు కనబడుతున్న పటాన్ని కూడ దాటి ఫ్రేము పగలగొట్టుకుని ఆకాశంలోకి దూసుకుపోతుంటే ఏదో తెలియని భయం వ్యాపిస్తోంది.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS