Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఆ చరిత్ర పీడకలే

Telangana, Telugu, Vartamaanam ఎన్.వేణుగోపాల్
జేమ్స్ జాయిస్ నవల ‘యులిసెస్’ లో ఒక పాత్ర ‘చరిత్ర నేను మేల్కొనదలచుకున్న ఒక పీడకల’ అంటుంది. ‘చరిత్రంటే జనం అంగీకరించడానికి ఇష్టపడే మిథ్య’ అన్నాడట నెపోలియన్. ఇవాళ పీడకల అయిన చరిత్రనుంచి మేల్కొనడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ మిథ్య అయిన చరిత్రలోకి ప్రయాణిస్తున్నట్టున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ఏ కారణంతో ఈ వివాదం రేకెత్తించారో, ఆ కారణం ఫలిస్తుందో లేదో తెలియదు గాని, చారానా దావత్ కూ బారానా టాంగా అన్నట్టు ఆ పావలా విందుకోసం [...]
పూర్తిగా చదవండి

బుద్ధదేవుని భూమిలో…

Telugu, Vartamaanam ఎన్.వేణుగోపాల్
బుద్ధదేవుని భూమిలో, తమను తాము కమ్యూనిస్టులమనీ, మార్క్సిస్టులమనీ పిలుచుకునేవారి పాలనలో నందిగ్రాంలో మళ్లీ హింస చెలరేగింది. ఈ సంవత్సరం జనవరి, మార్చిలలో జరిగిన పోలీసు కాల్పులలో, అధికార సిపిఎం కు చెందిన సాయుధ బలగం హర్మత్ వాహిని కార్యకర్తలు జరిపిన కాల్పులలో దాదాపు ఇరవై మంది ప్రాణాలు బలి అయిపోగా, ఈసారి హింసాకాండ పూర్తిగా సిపిఎం కార్యకర్తల ఆధ్వర్యంలోనే జరిగింది. కాల్పులు, దాడులు, గృహదహనాలు, స్త్రీలపై అత్యాచారాలు విచ్చలవిడిగా జరిగాయి. గత హింసాకాండ సమయంలో ఆ ప్రాంతం [...]
పూర్తిగా చదవండి

ఆదివాసుల దారి

Telugu, Vartamaanam ఎన్.వేణుగోపాల్
రాష్ట్రంలో ప్రతిఒక్కరి మనసుమీద ప్రశ్నగా వేలాడుతూ నిరంతరం ఆలోచింపజేస్తున్న నక్సలైటు ఉద్యమానికి ఈవారంలో నలభైసంవత్సరాలు నిండుతాయి. తెలుగుసమాజం మీద అసాధారణమైన ప్రభావంవేసిన శ్రీకాకుళ గిరిజన ఉద్యమంలో ఒక ముఖ్యమైన మైలురాయి అక్టోబర్ 31, 1967. ఆరోజున అప్పటి అవిభక్త శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం తాలూకా (ప్రస్తుత విజయనగరం జిల్లా కురుపాం మండలం) లేవిడి గ్రామంలో గిరిజనుల మీద తొలిసారి భూస్వాముల తుపాకులు పేలాయి. ఆరిక కోరన్న, కొండగొర్రి మంగన్న అనే ఇద్దరు గిరిజనులు మరణించారు. నక్సలైటు ఉద్యమం [...]
పూర్తిగా చదవండి

ఆదివాసుల దారి

Telugu, Vartamaanam ఎన్.వేణుగోపాల్
రాష్ట్రంలో ప్రతిఒక్కరి మనసుమీద ప్రశ్నగా వేలాడుతూ నిరంతరం ఆలోచింపజేస్తున్న నక్సలైటు ఉద్యమానికి ఈవారంలో నలభైసంవత్సరాలు నిండుతాయి. తెలుగుసమాజం మీద అసాధారణమైన ప్రభావంవేసిన శ్రీకాకుళ గిరిజన ఉద్యమంలో ఒక ముఖ్యమైన మైలురాయి అక్టోబర్ 31, 1967. ఆరోజున అప్పటి అవిభక్త శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం తాలూకా (ప్రస్తుత విజయనగరం జిల్లా కురుపాం మండలం) లేవిడి గ్రామంలో గిరిజనుల మీద తొలిసారి భూస్వాముల తుపాకులు పేలాయి. ఆరిక కోరన్న, కొండగొర్రి మంగన్న అనే ఇద్దరు గిరిజనులు మరణించారు. నక్సలైటు ఉద్యమం [...]
పూర్తిగా చదవండి

విద్యే మహావ్యాపారం

Telugu, Vartamaanam ఎన్.వేణుగోపాల్
“చదవనివాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత గలుగున్” అని ఆరుశతాబ్దాలకిందనే చదువుకూ వివేకానికీ మధ్య సంబంధాన్ని ప్రకటించిన జాతి మనది. ఇవాళ “చదువంటే వ్యాపారము, చదువుపేర కోట్లు కోట్లు దండుకోదగున్” అని ఆ వివేకాన్ని మార్చిన చతురత మన పాలకులది. ఇన్నాళ్లకివాళ ఏలినవారిదయవల్ల చదువుకు నిర్వచనం మారుతున్నట్టున్నది. ఈ అత్యాధునిక యుగంలో మనం ప్రజలను అజ్ఞులను చేసే, సదసద్వివేక చతురత కలగకుండాచేసే చదువుల వైపు మళ్లుతున్నట్టున్నది.
పూర్తిగా చదవండి

సమాల్ సవాళ్లెవరికి?

Telugu, Vartamaanam ఎన్.వేణుగోపాల్
భారతీయుల వాదవినోద కౌశలం గురించి పుస్తకమే రాసిన అమర్త్యసేన్ కూడ ఆశ్చర్యపోయే రీతిలో విలువైన సమయాన్నీ, శక్తినీ ఖర్చు చేస్తూ సేతుసముద్రం - రామసేతు వివాదం జరుగుతున్నది. ఇటువంటి పనికిరాని వివాదాలవల్ల వాస్తవంగా జరిగేదేమంటే అవి సమాజానికి నిజంగా అవసరమైన చర్చలకూ, సమాజం ముందున్న తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడానికీ సమయమూ స్థలమూ మిగలకుండా చేస్తాయి.
పూర్తిగా చదవండి

ఘాతుకం కానిదేది?

Telugu, Vartamaanam ఎన్.వేణుగోపాల్
‘వాకపల్లిలో అత్యాచారాలు జరగలేదు, పోలీసులను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నమది’ అని ఆ నేరం జరిగిన మరుక్షణమే నేరస్తులకు క్లీన్ చిట్ ఇచ్చినవాళ్లే, ‘వాకాడు నేరస్తులను వదిలిపెట్టం’ అని ఈ నేరస్తుల గురించి మాత్రం భీషణప్రతిజ్ఞలు చేయడం, రాజ్యం అన్ని వర్గాలమధ్య సమన్యాయం పాటించి, చట్టం ఎదుట అందరినీ సమానంగా చూస్తుందనే కనీస ప్రజాస్వామ్యసూత్రానికి అపహాస్యం.
పూర్తిగా చదవండి

ఎంత గొప్ప స్వాతంత్ర్యం!

Vartamaanam, english ఎన్.వేణుగోపాల్
ఆరుపదులు నిండిన స్వతంత్రభారతం గురించి మురిసిపోవడానికేమున్నది? ఈ దేశ ప్రజలు ఏ ఆశలతో, కలలతో బ్రిటిష్ పాలకులను వెళ్లగొట్టే మహోజ్వలపోరాటాలు నడిపారో ఆ ఆశలన్నీ అడియాసలయిన, ఆ కలలన్నీ కల్లలయిన అరవైగ్రీష్మాలను చూసి గర్వపడడానికి ఏమున్నది?
పూర్తిగా చదవండి

ముదిగొండ మారణకాండ ప్రశ్నలు

Andhra Jyothi, Telugu, Vartamaanam telugublogger
ఈ దేశంలో పేదప్రజల ప్రాణాలు కారుచౌక అయిపోయాయి. ఎక్కడ పోలీసు తుపాకి గర్జించినా పోయేవి అమాయక, నిస్సహాయ పేదప్రజల ప్రాణాలే. ఎక్కడ పాలక దుర్మార్గపు కాల్పులు జరిగినా వినబడే సమర్థన ఒకటే. ఎక్కడ రాజ్య దౌర్జన్యానికి అమాయకులు అసువులు బాసినా కనబడేవి నిజాయితీ లేని రాజకీయ నాయకుల పలకరింపులే, పరామర్శలే, గ్లిసరిన్ కన్నీళ్లే.
పూర్తిగా చదవండి

పోలీసులదేనా రాజ్యం?

Telugu, Vartamaanam telugublogger
“ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, పోలీసు రాజ్యం, తుపాకి రాజ్యం” అనే నినాదం ఈ రాష్ట్రంలో మార్మోగడం 1970ల చివరలోనో 1980ల మొదట్లోనో ప్రారంభమయింది. రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ ఎస్ యు), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యు) వంటి విప్లవ విద్యార్థిసంఘాల ద్వారా, మొత్తంగా నక్సలైటు రాజకీయాల ద్వారా ఆ నినాదం చలామణీలోకి వచ్చింది. అప్పుడు ప్రధానంగా ఈ నినాదం ఇస్తుండిన సంఘాలలో కొన్ని ఇప్పుడు నిషేధంలో ఉన్నాయి, కొన్ని [...]
పూర్తిగా చదవండి

ఆరువందలపదా, అదేమిటి?

Telangana, Telugu, Vartamaanam ఎన్.వేణుగోపాల్
జీవో 610 వివాదం మళ్ళీ ఒకసారి రాజుకుంటున్నది. ఒకసారి విషాదం గా ముగిసిన చరిత్ర మరొకసారి హాస్యాస్పదంగా పునరావృత్తమవుతుందని అన్నట్టు ఈసారి విషాదమూ ప్రహసనమూ కలగలిసి సాగుతున్నాయి. ఈసారి ప్రధాన చర్చ ఆ జీవోను అమలు చేయడమా చేయకపోవడమా అనికాదు. ఆ జీవో అసలేమిటో తెలుసునా అని జరుగుతున్నది.
పూర్తిగా చదవండి

మళ్లీ ఎన్ కౌంటరయిన సత్యం

Telugu, Vartamaanam ఎన్.వేణుగోపాల్
‘విరబూసే ఆపిల్ చెట్లు కాదు సత్యానికి తారుపూస్తున్న హిట్లర్ ఉపన్యాసాలు నాచేత పాటలురాయిస్తున్నాయి’ అన్నాడు ఏడుదశాబ్దాలకింద జర్మన్ కవి బెర్టోల్ట్ బ్రెహ్ట్. లక్షలాదిమందిని ఊచకోతకోసిన హిట్లర్ నాజీ పాలన చీకటిరోజుల్లో తన సృజనను వ్యక్తీకరిస్తూ ‘చీకటి రోజుల్లో పాటలుంటాయా’ అని అడిగి ‘ఉంటాయి’ అని తనకు తాను ఆశ్వాసం చెప్పుకుని ఆ పాటలు ‘చీకటి రోజులగురించే’నని వెలుగంత తేటతెల్లంగా చెప్పాడు బ్రెహ్ట్.
పూర్తిగా చదవండి

వర్గీకరణలో ప్రాంతీయ ప్రత్యేకత

Telugu, Vartamaanam ఎన్.వేణుగోపాల్
షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లను ఆ షెడ్యూల్డ్ కులాలలోనే కొన్ని వర్గాలు తమ జనాభా నిష్పత్తికన్న ఎక్కువగా వినియోగించుకుంటున్నందువల్ల, మరికొన్ని వర్గాలు తమ న్యాయమైన వాటాను పొందలేకపోతున్నాయనే వాదనతో, రిజర్వేషన్ల కల్పనలో షెడ్యూల్డ్ కులాల మధ్య కూడ వర్గీకరణను అమలు చేయాలని మొదలయిన మాదిగ దండోరా ఉద్యమం పదమూడు సంవత్సరాల కాలంలో అనేకమలుపులు తిరిగింది. మాదిగ దండోరా నాయకత్వం అప్పుడప్పుడు అవకాశవాద వైఖరి అవలంబించినా, పాలకవర్గ ముఠా తగాదాల్లో తెలిసో తెలియకనో భాగమయిపోయినా, ఆ ఉద్యమపు [...]
పూర్తిగా చదవండి

జీవోమీదజీవోమీదజీవో…

Telugu, Vartamaanam ఎన్.వేణుగోపాల్
జీవో 610 మీద మరొక సారి వివాదం మొదలయింది. ఇరవైరెండు సంవత్సరాల కాలయాపన చేసిన ప్రభుత్వం నెలరోజులలోపల అమలు చేస్తానని పారదర్శకంగా అబద్ధమని తేలిపోయే ప్రగల్భాలు పలుకుతున్నది. ఆ అమలుకోసమేననే పేరుతో మరొక జీవో తెచ్చింది. కోస్తాంధ్రకు, రాయలసీమకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని తమకు తాము చెప్పుకునే నాయకులు ఆ జీవోను అమలు చేయనేగూడదని ప్రకటిస్తున్నారు. ఒక ఉద్యోగ సంఘ నాయకుడు మరొక అడుగు ముందుకువేసి తెలంగాణ దయ్యం పట్టిందని, దాన్ని వదిలించే భూత వైద్యం జరగాలని అన్నారు. [...]
పూర్తిగా చదవండి

భూపోరాటంలో పొల్లూ నెల్లూ

Telugu, Vartamaanam ఎన్.వేణుగోపాల్
కొద్దివారాలుగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో ఇళ్లస్థలాలకోసం నిర్వాసిత పేదలు, గ్రామీణ ప్రాంతాలలో సాగుభూమికోసం భూమిలేని నిరుపేదలు బ్రహ్మాండమైన భూపోరాటం జరుపుతున్నారు. ప్రధానంగా పట్టణప్రాంతాలలో ఇళ్లస్థలాల కోసం ప్రారంభమైన భూపోరాటం క్రమంగా తక్కువగానే అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు కూడ విస్తరించింది. వందలాదిగా, వేలాదిగా ప్రజలు ఈపోరాటాలలో, భూ ఆక్రమణలలో పాల్గొంటున్నారు.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS