Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సైంధవులు, శిశుపాలురు, మన పాలిట గుదిబండలు - రాజకీయులు

రాజకీయాలు చదువరి
రాజకీయుల పేకాట, ప్రజల జీవితాలతో చెలగాటం. ఒక దృష్టాంతమిది. పై ఫోటోలు రెంటినీ ఈనాడు నుండి సేకరించాను. మొదటి దాన్లో ఏం జరుగుతుందో చూసారుగా. పేకాటాడుతున్నారు ఈ నేతలు -నడిరోడ్డున ! వాహనాలేమీ కదలనీయకుండా దిగ్బంధనం చేసారు. ఈనాడులో వార్త చూడండి. ఇక రెండో ఫోటో: అనారోగ్యంగా ఉన్న బిడ్డను ఆసుపత్రికి తీసుకు వెళ్ళే తొందర్లో ఉన్న వీరిని పై రకం రాజకీయులు, వారి అంతేవాసులు అడ్డుకుంటే.. నిస్సహాయంగా
పూర్తిగా చదవండి

ఊరు బడి చెబుతుంది ఏలుబడి తీరు!

రాజకీయాలు చదువరి
ఆంధ్రజ్యోతి లో జనవరి 31 న ఓ వ్యాసం వచ్చింది. ప్రభుత్వ బడుల గురించి లోక్‌సత్తా నాయకుడు వర్మ రాసిన వ్యాసమిది. పైనున్న శీర్షిక పేరు కూడా ఆయన పెట్టిందే. ప్రభుత్వ బడుల గురించిన గణాంకాలను రాసారీ వ్యాసంలో. అందులోంచి ఒక్క విషయాన్ని నేనిక్కడ రాస్తాను. "రాష్ట్రంలో 20 శాతం ఉపాధ్యా యులు తక్కువగా ఉన్నారు. అదనంగా 54, 730 మంది ఉపా ధ్యాయుల అవసరం ఉందని 'కాగ్‌' నివేదిక పేర్కొంది. వీరికి బదులుగా 46,544 మంది
పూర్తిగా చదవండి

సాయిబాబా - తెలంగాణా

రాజకీయాలు చదువరి
"..ఈ విధంగా దేశాన్ని ముక్కలు చెయ్యడం మహాపాపం. నేను ఏ రాష్ట్రం, ప్రాంతం గురించి మాట్లాడడం లేదు. నాకు అలాంటి భేదాల్లేవు.." - చెన్నై సభలో సాయిబాబా. సత్యసాయిబాబాకు రాష్ట్ర ప్రాంత భేదాల్లేవట. భారతదేశమొక్కటే ప్రధానమైనదట. దేవుడికి మానవాళి అంతా ఒక్కటే కదా, దేశ భేదాలుంటాయా? విశ్వం గురించి మాట్లాడాలసిన దేవుడు, దేశ రాజకీయాల గురించి మాట్లాడ్డమేమిటో? వృద్ధాప్యం వలన ఆయన ప్రసంగంలో స్పష్టత లోపించిందట;
పూర్తిగా చదవండి

సీతాకోక చిలుక ప్యూపా దశకు పోతూంది

రాజకీయాలు చదువరి
దేశంలోని వనరులపై మొదటి హక్కు ముస్లిములకే ఉందట. హఠాత్తుగా దీన్ని ఎలా కనుకున్నాడో తెలియదు గానీ, చాలా గొప్ప సూత్రాన్ని ప్రజల్లోకి వదిలాడు, మన ప్రధానమంత్రి. రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసారో ఏంటో తెలీదు గానీ, ఇంతకు ముందెవరూ చెప్పని కొత్త విషయమిది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు త్వరలో రానుండడం, అక్కడ ముస్లిము వోట్లు ఎక్కువగా ఉండడం ఈ ప్రకటనకు ముఖ్య కారణమని ప్రతిపక్షాల గోల. రాజకీయుడి గుట్టుమట్లు రాజకీయుడికి ఎరుకే
పూర్తిగా చదవండి

తెలంగాణా సెంటిమెంటు + యాంటీ కాంగ్రెసు సెంటిమెంటు = కరీంనగర్

రాజకీయాలు చదువరి
కరీంనగర్లో తెరాస గెలుపు కారణంగా తెలంగాణ వస్తుందో రాదో తెలీదు గానీ, తెలంగాణ కావాలని కరీంనగర్ ప్రజలు కోరుకుంటున్నారనేది మాత్రం తేటతెల్లమై పోయింది. కాంగ్రెసు మోసాన్ని, కుటిలనీతిని, మాటలు మార్చే తత్వాన్ని ప్రజలు గ్రహించారు, ఆగ్రహించారు. వారి ధర్మాగ్రహమే నేటి తెరాస విజయం. కేసీయారు పై ప్రజలకు వల్లమాలిన అభిమానం ఉందో లేదో గానీ, తెలంగాణ కాంక్షించి మాత్రం ఆయనకీ మెజారిటీ ఇచ్చారనేది సుస్పష్టం. బీజేపీపై
పూర్తిగా చదవండి

మార్గదర్శి

రాజకీయాలు, సమాజం చదువరి
మార్గదర్శిది తప్పని రిజర్వు బ్యాంకు తేల్చేసింది. అందులో డబ్బు పెట్టిన వారికి ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేం లేకపోవచ్చు. కానీ, మార్గదర్శి నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసినట్లుగా ఋజువైంది. ఒకటీ రెండూ కాదు, 2200 కోట్ల రూపాయలు ప్రజల దగ్గరి నుండి సేకరించింది. నిబంధనలకు వ్యతిరేకంగా చెయ్యడం అనైతికతే కాదు, నేరం కూడా. సేకరించిన డబ్బులను సకాలంలో తీర్చెయ్యాలని ఆదేశించింది, బానే ఉంది. కానీ అసలు సేకరించడం తప్పు
పూర్తిగా చదవండి

బీడీ, భాషా, యాసా కాదేదీ ఎన్నికల ప్రచారాని కనర్హం

రాజకీయాలు చదువరి
మన ఎన్నికలలో మామూలు విషయాలకు కూడా కొత్త అర్థాలు వస్తూంటాయి. ఏ ప్రాముఖ్యతా లేని మామూలు విషయాలను మన రాజకీయులు పెద్దవి చేసి ప్రజల సానుభూతిని, తద్వారా ఓట్లను కొల్లగొట్టే ఆలోచనలు చేస్తుంటారు. కరీంనగరు, బొబ్బిలి ఎన్నికల్లో కూడా ఇలాంటి రెండు విషయాలు పైకి తేలాయి. కరీంనగరు ఎన్నికకు వస్తే... వెంటనే గ్రహించేసి ఉంటారు - బీడీల గురించి అని. ఈ ప్రాంతంలో బీడీ ఆకు (తునికాకు) ఏరుకుని బీడీలు చుట్టి అమ్ముకునే
పూర్తిగా చదవండి

వోక్సూ పోనాదండి

రాజకీయాలు చదువరి
ఇక తేలిపోయింది. వోక్సువాగను పోయింది. వశిష్ట వాహన్ అనే అడ్రసులేని కంపెనీకిచ్చిన 11 కోట్లూ పోయాయి. రాష్ట్రానికి అప్రదిష్ట మిగిలింది, బొత్స సత్యనారాయణ మిగిలాడు. ఆయనకు మంత్రి పదవి మిగిలింది. తమ్ముడితో కలిసి ఆయన చేసిన జర్మనీ పర్యటన మిగిలింది. ఆయనకి ఇంకా ఏమేం మిగిలాయో తెలీదు. ఆ 11 కోట్లూ ప్రభుత్వం ఎవరికిచ్చిందో గానీ, ఐపూ అజా లేవు. ఈ వోక్సు వాళ్ళ పద్ధతేమి బాగాలేదు. కర్మాగారం పెడతామంటూ రాష్ట్ర
పూర్తిగా చదవండి

నెంబర్‌ వన్‌ ఆంధ్రుడు ‘అన్న’గారే…

అన్నివర్గాలు, తెలుగు, రాజకీయాలు వెంకట రమణ
హైదరాబాద్‌, నవంబర్‌ 13 (ఆన్‌లైన్‌) ఆత్మగౌరవ నినాదంతో తెలుగు జాతి కీర్తిని ప్రపం చానికి చాటిన స్వర్గీయ నందమూరి తారకరామా రావు రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారనేది మరోసారి రుజువైంది. గత 50 ఏళ్లలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఆంధ్రుడు ఎవరనే అంశంపై సిఎన్‌ ఎన్‌- ఐబిఎన్‌ ఛానల్‌ ఆన్‌లైన్‌ పోల్‌ను నిర్వహించిం ది. ఇందులో పాల్గొన్న వారిలో అత్యధికంగా 70 శాతం మంది ఎన్టీఆర్‌కే ఆ ఘనత దక్కుతుందని తేల్చిచెప్పారు. ఎన్టీఆర్‌ను మించిన ఖ్యాతిగాంచిన తెలు గోడు [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS